ప్రపంచ సికెల్ సెల్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : ప్రపంచ సికెల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ అభినవ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ‘‘2047 నాటికి సికెల్ సెల్ రక్తహీనత నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం’’ అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశీయ ఆదివాసీ జనాభాలో అత్యధికంగా కనిపించే పది ప్రధాన ఆరోగ్య సమస్యలలో సికెల్ సెల్ ఎనీమియా ఒకటిగా గుర్తించబడింది. ఈ వ్యాధి గిరిజనులలో వేగంగా విస్తరిస్తుండటమే కాకుండా, తీవ్ర ఆరోగ్య ప్రభావాలు చూపిస్తున్నదని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్, హెల్త్ సూపర్వైజర్ రమణ కుమారి, ఏఎన్ఎం కవిత, ల్యాబ్ టెక్నీషియన్ సురేష్, ఇతర వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.