వెంకటాపురంలో 45 పాఠశాలలకు వంటపాత్రల పంపిణీ

వెంకటాపురంలో 45 పాఠశాలలకు వంటపాత్రల పంపిణీ

వెంకటాపురంలో 45 పాఠశాలలకు వంటపాత్రల పంపిణీ

వెంకటాపురం, జూన్ 19, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని 45 సెలెక్టెడ్ ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద వంటపాత్రలు మంజూర య్యాయి. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి ఆర్.వి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో సంబంధిత ప్రధానోపాధ్యాయుల కు వంటపాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంటపాత్రలను జాగ్రత్తగా ఉపయోగించాలని, ప్రతి రోజు మెనూను పాటిస్తూ రుచికరమైన మరియు పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులగూడెం, రంగరాజపురం కాలనీ పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు పి. సూర్యనారాయణ, ఎన్. నరసింహస్వామి, భుజంగరావు, సి.ఓ. ఆదిలక్ష్మి, ఎం.ఐ.ఎస్. యశోద, సి.ఆర్.పి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment

Footer Content