వెంకటాపురంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
– బావి భారత ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలుఅంటూ నినాదాలు
వెంకటాపురం, జూన్ 18, తెలంగాణ జ్యోతి : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాహుల్ గాంధీ పార్టీకి రథసారధిగా కొనసాగుతున్నారనీ, పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆకాంక్షిస్తూ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామా గ్రామానికి కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేయాలని, పార్టీ విజయాన్ని రాహుల్ గాంధీ జన్మదినానికి బహుమతిగా అందించాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నిలబెట్టేందుకు, కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాను భుజాన వేసుకొని ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ విజయానికి పని చేయాలని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మన్యం సునీల్, సీనియర్ నాయకులు జల్లి గంపల కళాధర్, బాలసాని వేణు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టెం సాయి, మద్దుకూరి ప్రసాద్, మంచాల భూషణం, గుండమల్ల కిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాలం సాయి, కే. శ్రీను, సీతాదేవి, డర్రా రవి, సుంకరి రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.