మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో కళ్యాణ లక్ష్మి, సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల అందజేత
– నేరుగా గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు
మహాదేవపూర్, జూన్ 18, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గం లోని మహాదేవపూర్, పలిమేల, మహాముత్తారం మండలాలలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ లబ్ధిదారులకు మంత్రి వ్యక్తిగత ప్రభుత్వ సహాయకులు ఆకుల చంద్రశేఖర్ చెక్కులను అందజేశారు. మహాముత్తారం మండలంలో 21 కల్యాణ లక్ష్మి చెక్కులు, 19 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మహదేవ్ పూర్ మండలంలో 23 సీఎంఆర్ఎఫ్ చెక్కులు, పలిమెల మండలం లో 15 కళ్యాణ లక్ష్మి చెక్కులు,1 సీఎంఆర్ఎఫ్ చెక్కు, భూపాలపల్లి మండలానికి 1 సీఎంఆర్ఎఫ్ చెక్కు, మొత్తం 80 చెక్కులు – 47 లక్షల 66 వేల రూపాయల విలువచేసే చెక్కులను మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంజూరి చేయించారు. బుధవారం మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, పోలారం, నిమ్మగూడెం, స్తంభంపల్లి (పిపి), యామన్ పల్లి, సింగంపల్లి, బోర్లగూడెం, కొర్లకుంట, కనుకునూర్, రేగులగూడెం, పలిమెల మండలంలోని దమ్మూర్, పలిమెల, పంకెన, నీలంపల్లి, లెంకలగడ్డ, పలిమెల, సర్వాయి పేట, ముకునూర్ , మోదేడు, మహదేవ్ పూర్ మండలంలోని ఎడపల్లి, బొమ్మాపూర్, రాపల్లికోట, మహదేవ్ పూర్, బ్రాహ్మణ పల్లి, సూరారం, అంబట్ పల్లి, ఇతర గ్రామాలకు చెందిన చెక్కులను వారి గ్రామం వద్దకే వచ్చి మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు వారి వ్యక్తిగత ప్రభుత్వ సహాయకులు ఆకుల చంద్ర శేఖర్ నేరుగా లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.