నిరుపేద వృద్ధురాలికి బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం
ఏటూరునాగారం, జూన్ 10, తెలంగాణ జ్యోతి : ఏటూరు నాగారం మండలానికి చెందిన అనుము సమ్మక్క అనే వృద్ధురాలు తగిన నివాసం లేకుండా, కరెంట్ సదుపాయం లేక జీవనం సాగిస్తున్న విషాదకర పరిస్థితి తెలిసిన వెంటనే ఏటూరునాగారం బ్లడ్ డోనర్స్ సభ్యులు స్పందించి ఆర్థిక సహాయం అందించారు. సమక పరిస్థితిపై బ్లడ్ డోనర్స్ గ్రూప్లో సమాచారం పంచడంతో దాతలు ముందుకొచ్చారు. వారి సహాయంతో రూ.2 వేల విలువ చేసే విద్యుత్ సామాగ్రి, రూ.3500 విలువైన నిత్యావసర వస్తువులు, రూ.1500 విలువైన టేబుల్ ఫ్యాన్, రూ.1200 విలువైన గ్యాస్ ను సమ్మక్కకు అందించారు. ఈ సందర్భంగా సమ్మక్క బ్లడ్ డోనర్స్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో సయ్యద్ వహీద్, మహమ్మద్ మున్నా, జగన్నాధం నాగసాగర్, గద్దల చరణ్, అరవింద్, రాజేష్, జానకి, రెడ్డి రోకేష్ తదితరులు పాల్గొన్నారు.