సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
కాటారం, జూన్ 10, తెలంగాణ జ్యోతి : శాంతి భద్రతలను కాపాడడంలో ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసుల కు సమానమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళారం ఉదయం భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని రెడ్డికాలనీ పేస్ – 1 లో సీసీ కెమెరాలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. భూపాలపల్లి మున్సి పాలిటీలోని 30 వార్డులు రెడ్డికాలనీ వాసులను ఆదర్శంగా తీసుకుని అన్ని వార్డుల్లో దొంగతనాలు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.