మేడిగడ్డ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్ గ్రేషియా

మేడిగడ్డ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్ గ్రేషియా

మేడిగడ్డ మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఎక్స్ గ్రేషియా

– రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

కాటారం, జూన్ 9, తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ ప్రాజెక్టు గోదారి నదిలో పడి మరణించిన మృతుల కుటుంబాలను ఆదివారం రాత్రి ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. మహాదే వపూర్ మండలంలోని అంబట్ పల్లి, మహాముత్తారం మండలం లోని కొర్లకుంట, స్తంభంపెళ్లి గ్రామాలలో ఆదివారం రాత్రి మృతుల కుటుంబాలను పరామర్శించారు. యువకుల ప్రాణాలు కాపాడలేక పోయామని శ్రీధర్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను రక్షించేందుకు ప్రభుత్వం తరఫున జిల్లా యంత్రాంగం ను పంపించామని, సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. సంఘటన ఎలా జరిగిందని కుటుంబ సభ్యులను శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టులో నీటి ప్రవాహం ఎంత మేరకు ఉందని అడిగారు. మృతి చెందిన ఒక్కో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుండి లక్ష ఎక్స్ గ్రేషియా, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. భూమిలేని నిరుపేదలమని, కూలీపని చేసుకుని జీవిస్తున్నామని తమను ఆదుకోవాలని మృతులు కుటుంబ సభ్యులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వృత్తుల కుటుంబా లకు అన్ని విధాలుగా ఆదుకుంటామని, అధైర్యపడవద్దని మంత్రి హామీ ఇచ్చారు. కాటారం మండలంలోని గంగారం గ్రామంలో ఇటీవల జరిగిన కారు యాక్సిడెంట్ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు పరామ ర్శించారు పుష్కరాలలో వడ దెబ్బతో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడు మంతెన సమ్మయ్య కుటుంబాన్ని, వివిధ కారణాలతో మరణించిన మరో రెండు కుటుంబాలను పరామర్శించారు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్,కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ విలాస్ రావ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, నాయకులు వామన్ రావు, వేమునూరి ప్రభాకర్ రెడ్డి, దుర్గయ్య, ఉత్సవ కమిటీ దేవస్థానం డైరెక్టర్ బీసుల నర్సయ్య, తెప్పెల దేవేందర్ రెడ్డి, చీర్ల తిరుపతిరెడ్డి, వొన్న వంశ వర్ధన్ రావు,అంగజాల అశోక్ కుమార్, కొట్టే ప్రభాకర్,కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment