మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో 6 గురు దుర్మరణం
కాటారం, జూన్ 08, తెలంగాణ జ్యోతి : వేసవి సెలవులు.. వివాహశుభకార్యం.. సరదాగా.. గడుపుదామనుకున్న యువ స్నేహితులంతా కలిశారు. ఈత రానప్పటికీ గోదావరి నదిలో స్నానం చేయాలని గోదావరి నదికి వెళ్లారు. గోదావరి నదిలో లోతును గమనించని యువకులు దిగుతూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు. యువకుల సరదా వారి పాలిట మృత్యు శాపమైంది పలు కుటుంబాలకు శోక సంద్రాన్ని మిగిల్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీలో శనివారం సాయంత్రం 6గురు యువకులు నీటి ప్రవాహంలో పడి గల్లంతయ్యారు. మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకట స్వామి కుమారుడు పట్టి మధుసూదన్(18), పట్టి శివ మనోజ్(15) తోపాటు వెంకటస్వామి మేనల్లుడు తొగరి రక్షిత్ (13), అంబట్ పెళ్లికి చెందిన మరో యువకుడు కర్నాల సాగర్ (16), మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన బొల్లెడ్ల రామ్ చరణ్(17), అలియాస్ పండు, స్తంభం పల్లి(పిపి) గ్రామానికి చెందిన పసుల రాహుల్ తో పాటు పట్టి శివమణికంఠ శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరి నదిలో సరదాగా స్నానం చేయడానికి వెళ్లారు. అందరూ యువకులు కావడంతో ముందు జాగ్రత్తగానే పత్తి వెంకటస్వామి స్వయంగా వీళ్లందరినీ ఆటోలో మేడిగడ్డ గారెలు తీసుకెళ్లారు గ్యారేజ్ ఎగువ ప్రవాహంలోని బ్లాక్ 3 వద్ద స్నానం చేస్తుండగా ప్రమాదవ శాత్తు నీటి ప్రవాహంలో యువకులంతా చిక్కుకున్నారు. ఎవరికి ఈ త రాకపోవడంతో క్రమంగా నీటిలో పరికి వెళుతూ కేకలు వేశారు అక్కడే ఒడ్డుపై ఉన్న శివమణికంఠ వెంకటస్వామి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు సమయం గడిచిపోవడంతో నీటి ప్రవాహంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదెళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సింగరేణి తోపాటు ఫైర్ పోలీస్ శాఖలకు చెందిన రెస్క్యూటివ్ ఘటనా స్థలానికి చేరుకొని శనివారం రాత్రి,ఆదివారం ఉదయం తీవ్రంగా గాలించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు ఒక్కొక్కటిగా ఆరు మృత దేహాలను గోదావరి నుండి బయటకు తీశారు. ఐదు కుటుంబాలకు చెందిన ఆరుగురు బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాజిక వర్గం కావడం ఒకే గతంలో ఆరుగురు మృత్యువాత పాడడంతో కుటుంబాల రోదనలు కన్నీటి పర్యంతం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. ఈత కొట్టాలనే సరదా యువకుల పాలిట మృత్యోగ నిలిచింది ఆదివారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దాన సంస్కారాలు నిర్వహించారు మృతదేహాలు వెలికితీస్తున్నంత సేపు గోదావరి తీరంలో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు. పోలీసులు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు నిర్వహించారు.
మహదేవపూర్ ఆసుపత్రి లో పోస్టుమార్టం
గోదావరి నదిలో పడి మృతి చెందిన ఆరు మృతదేహాలకు మహాదేవపూర్ లోని సామాజిక ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు పిఏ ఉక్కు ప్రవీణ్ కుమార్ పోస్టుమార్టం కిట్లు అందజేశారు. సహాయక ఏర్పాట్లు నిర్వహించారు.