మేడిగడ్డ బ్యారేజీ లో ఆరుగురు యువకుల గల్లంతు

మేడిగడ్డ బ్యారేజీ లో ఆరుగురు యువకుల గల్లంతు

మేడిగడ్డ బ్యారేజీ లో ఆరుగురు యువకుల గల్లంతు

– కొనసాగుతున్న సహాయక చర్యలు

కాటారం, జూన్7, తెలంగాణజ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండంలం మేడిగడ్డ ప్రాజెక్టులో స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… అంబటిపల్లి గ్రామానికి చెందిన నలుగురు, కొర్లకుంట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజ్ గోదావరి నదిలో స్థానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యారు. అంబటిపల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులు పత్తి మధుసూదన్ (18),పట్టి శివ మనోజ్ (15), తోకరి రాజు కుమారుడు తొగరి రక్షిత్(13), కర్నాల సమ్మయ్య కుమారుడు కర్నాల సాగర్ (16), కొర్లకొండ గ్రామానికి చెందిన పండు (18), రాహుల్ (19), 8 మంది యువకులు గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లారు. గోదావరి స్నానానికి వచ్చి గల్లంతు కావడం జరిగింది. సంఘటన స్థలాన్ని మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ పరిశీలిస్తున్నారు. గల్లంతమైన యువకుల కొరకు గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మెరిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సమయంలో తీసిన పెద్ద మడుగులో నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో స్నానం చేయడానికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయారు. ఆరుగురు నీటిలో గల్లంతుగా మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంత యిన ఆరుగురు యువకులు మరణించినట్లుగానే భావిస్తు న్నారు. మృతదేహాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు గోదావరి నది తీరంలో యువకుల కుటుంబ సభ్యుల రోదనలు ఈ ప్రాంత ప్రజలను మనోవేదనకు గురి చేస్తున్నాయి. సరదాగా స్నానానికి వెళ్లిన యువకులు చివరకు గల్లంతై మృత్యు ఒడిలోకి వెళ్లడంతో తీవ్ర విశాదం నెలకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనే గతంలో కనివిని ఎరుగని రీతిలో జరిగిన సంఘటన సంచలనంగా మారింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment