ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో వైద్య శిబిరం
– వైద్యాధికారి డాక్టర్ బి నరహరి
ఏటూరునాగారం,జూన్6,తెలంగాణజ్యోతి:ఏటూరునాగారం మండలం పరిధిలోని రాయబంధం గ్రామంలో ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గురువారం జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు రాయబంధం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఆర్ బి ఎస్ కే వైద్యాధికారి డాక్టర్ బి నరహరి ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కే వాహనం దాటలేని పరిస్థితిలో నడక మార్గంలో కిలోమీటర్ వరకు కాలినడకన వాగుదాటి, ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 29 కుటుంబాల పిల్లలకు మందులు అందజేశారు. అంతేకాకుండా అంగన్వాడి సెంటర్ లోని పిల్లలకు శారీరక మానసిక పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు సలహాలు మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ సిహెచ్ భాస్కర్, అంగన్వాడీ టీచర్ లక్ష్మి, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.