పశువుల టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
ములుగు ప్రతినిధి, జూన్ 6,తెలంగాణ జ్యోతి : రాష్ట్ర పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులను నివారించే టీకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవా లని పశు వైద్య సిబ్బంది ఎల్ఎస్ఏ ఆకుల నరేష్ సూచించారు. ములుగు మండల పరిధిలోని ప్రేమనగర్ గ్రామంలో గురువారం పశువులకు గొంతు వాపు, జబ్బబాబు వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆకుల నరేష్ మాట్లాడుతూ“పశువులను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడు కోవడానికి టీకాలు సమయానికి వేయించుకోవడం ప్రతి రైతు బాధ్యత” అన్నారు. టీకా కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ కార్యాలయ సిబ్బంది చరణ్ పాల్గొన్నారు.