అంతర్జాతీయ యోగా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
ములుగు ప్రతినిధి, జూన్ 5, తెలంగాణ జ్యోతి : ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరిష్ లు యోగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, ఇది శారీరక, మానసిక సంక్షేమానికి తోడ్పడుతుందని వివరించారు. వచ్చే 25 రోజుల పాటు జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లీ చంద్ర, డాక్టర్ సంధ్య, యోగా ఇన్స్ట్రక్టర్ శివకృష్ణ, హరిత, తదితరులు పాల్గొన్నారు.