ములుగు మున్సిపాలిటీలో 20వార్డులు

ములుగు మున్సిపాలిటీలో 20వార్డులు

ములుగు మున్సిపాలిటీలో 20వార్డులు

– ములుగు, బండారుపల్లి, జీవంతరావుపల్లి కలిపి విభజన

ములుగు ప్రతినిధి, జూన్ 4, తెలంగాణ జ్యోతి : ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి కావస్తోంది. తెలంగాణ మున్సిపల్ లా అమెండ్ మెంట్ ఆర్డినెన్స్ నెంబర్17/2025 ములుగు మున్సిపాలిటీలో 20వార్డులుగా విభజిస్తూ మున్సిపల్ కమిషనర్ జే.సంపత్ ఉత్తర్వులు వెలువ రించారు. ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేయక ముందు ములుగులో 16వార్డులు, బండారుపల్లిలో 10వార్డులు, జీవంతరావుపల్లిలో 6వార్డులు ఉండేవి. ప్రస్తుతం మున్సిపాలిటీ ఏర్పాటు అయిన నేపథ్యంలో ములుగు జీపీలను కలుపుతూ 20వార్డులుగా ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కేంద్రంతోపాటు హామ్లెట్ గ్రామాలైన రంగారావుపల్లి, ప్రేమ్నగర్, మాధవరావు పల్లి, బండారుపల్లి, జీవంతరావుపల్లి, గణేష్లాల్ పల్లి లలోని వివిధ కాలనీలను వార్డులుగా విభజించారు. విభజించిన వార్డులకు సంబంధించి ఆయా వార్డుల్లోని ప్రజలకు అభ్యంతరా లు ఉంటే వారం రోజుల్లో తెలపాలని కమిషనర్ సూచించారు. ఈనెల 5 నుంచి 11వతేదీ లోపు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని, లేనట్లయితే ఇదే ఫైనల్ గా భావించబడుతుందన్నారు. ములుగు మున్సిపాలిటీలో వార్డుల వివరాలు ఈవిధంగా ఉన్నాయి. 20 వార్డుల్లో మొత్తం 13920 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి వార్డులో జీవంతరావుపల్లి, గణేష్ లాల్ పల్లి, 2వ వార్డులో పాల్సాబ్పల్లి, గడిగడ్డ, 3వ వార్డు బెస్తవాడ, వడ్డెరవాడ, సుభాష్ నగర్, సఫాయివాడ, 4వ వార్డు లక్ష్మీనగర్, గాంధీ పార్క్ ఏరియా, బస్టాండ్, డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంతాలు, 5వ వార్డు బృందావన్ కాలనీలోని కొంత భాగం, ఎస్సీ కాలనీ, 6వ వార్డులో కాపు వాడ, 7వ వార్డులో మాధవరావుపల్లి, వీవర్స్ కాలనీ, దుర్గా కాలనీ, 8వ వార్డు ప్రేం నగర్, ప్రగతి కాలనీ, ఏరియా ఆస్పత్రి వెనక భాగం, ఆదర్శ కాలనీ, 9వ వార్డు కృష్ణా కాలనీ, బీసీ కాలనీ, సాధన స్కూల్, బండారుపల్లి మెయిన్ రోడ్డు ఏరియా, 10వ వార్డు బండారుపల్లిలోని హనుమాన్ గుడి, పోచమ్మ గుడి, మసీదు, మెయిన్ రోడ్డు, 11వ వార్డు బీరన్న టెంపుల్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కాలనీ, మధర్ థెరిసా కాలనీ, అటల్ బిహారీ వాజ్ పేయి కాలనీ, 12వార్డులో మహాత్మా గాంధీ కాలనీ, మెయిన్ రోడ్డు ఏరియా, వివేకానంద, జవహరల్ లాల్ నెహ్రు కాలనీలు, 13వ వార్డులో జగ్జీవన్ రాం, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్కాలనీలు, బండారుపల్లి మెయిన్ రోడ్డు14వ వార్డు ములుగులోని ఎంపీడీవో ఆఫీస్ ఏరియా, హనుమాన్ బస్తీ, చాకలి వాడ, ఫారెస్ట్, కలెక్టరేట్ ఆఫీస్ ఏరియా, 15వ వార్డు రంగారావుపల్లి, పోలీస్ స్టేషన్, కోర్టు ప్రాంతాలు, 16వ వార్డు నాయకపోడ్ కాలనీ, పైడిమల్లయ్య స్ట్రీట్, ఏపీజీవీబీ బ్యాంక్ ఏరియా, 17వ వార్డు శివాలయం వెనుక వైపు, ఎక్సైజ్ కార్యాలయం ఏరియా, 18వ ఫకీర్ వాడ, గొల్లవాడ, మార్కెట్ ఏరియా, 19 వీవర్స్ కాలనీ, పెద్దతల్లి టెంపుల్ ఏరియా, 20వ వార్డు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఏరియా, నాయకపు వాడలో కొంత భాగం, మున్సిపల్ ఆఫీస్ ఏరియాలు ఉన్నాయి.

అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పలు కాలనీల ప్రజలు

మున్సిపాలిటీ వార్డుల విభజనపై ఆయా కాలనీల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా విభజన చేపట్టారని గతంలో ఒక్కో వార్డులో ఉన్నటువంటి ప్రజలు విభజించి పాలించు అన్న చందంగా తమ వ్యవస్థ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పార్టీల నాయకులు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని అధికారులపై ఒత్తిడి తెచ్చి వార్డుల విభజన చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ వార్డుల విభజన చేపట్టిన నేపథ్యంలో కమిషనర్ విస్తృత అధికారాలతో పున సమీక్షించి ఆయా కాలనీల ప్రజల అభిప్రాయాలను తీసుకొని వార్డుల విభజన తిరిగి చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పబ్లిక్ నోటీసు గ్రామసభలు పెట్టకుండా అభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఏకపక్షాన వార్డుల విభజన జరిగిందని దీనిని పున సమీక్ష చేపట్టాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment