వెంకటాపురం ఎంపీడీవో కార్యాలయంలో చెట్టు తొలగింపు
– విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేత
వెంకటాపురం,జూన్ 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంకటాపురం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న భారీ వృక్షాన్ని తొలగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ చెట్టు ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా నిర్మించుతున్న ఇందిరమ్మ మోడల్ హౌస్కు అడ్డుగా ఉండటంతో దీనిని తొలగించే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూన్ 30 సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు వెంకటాపురం పట్టణంలోని 11 కేవీ ఫీడర్లో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. చెట్టు తొలగింపు కార్యక్రమానికి సంబంధించి, ఎటూరునాగారం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది, ఫైర్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఆదివారం ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యుత్ తీగలు, రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు, ఇతర భద్రతాపరమైన అంశాలన్నింటిని పరిశీలించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకో వాలని నివేదించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేసి, చెట్టు తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ వినియోగదారులు తాత్కాలిక అసౌకర్యానికి సహకరించాలని వెంకటాపురం ఏఈ ఒక అధికారిక ప్రకటనలో కోరారు.