రూ.5 వేల తో దీపోత్సవానికి నూనె వితరణ

రూ.5 వేల తో దీపోత్సవానికి నూనె వితరణ

గణపురం, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి రూ 5 వేల తో గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి వెంకట లక్ష్మీనరసింహారావు పావన రాజ్యలక్ష్మి దంపతులు నూనె క్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి నూ యినెను అందించిన దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment