ముమ్మరంగా వాహనాలు తనిఖీలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని, వాజేడు మండలం వై జంక్షన్ జగన్నాధపురం జాతీయ రహదారిపై వాజేడు పోలీసులు శనివారం ఉదయం విస్తృతంగా వాహనాలు తనిఖీల కార్యక్రమాన్ని నిర్వహించారు.వాజేడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో, వచ్చే పోయే వాహనాలను తనిఖీలు నిర్వహించి, అపరిచిత వ్యక్తుల సమాచారాన్ని ఈ సందర్భంగా రాబట్టారు. వాహనాల తనిఖీల కార్యక్రమంలో వాజేడు సివిల్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.