మావోయిస్టు భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ

మావోయిస్టు భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ

మావోయిస్టు భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ

భోత్, జూన్ 9, తెలంగాణ జ్యోతి : భోత్ మండలం పోచ్చేర గ్రామానికి చెందిన మావోయిస్టు భాస్కర్ అలియాస్ అడెల్లు ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయనకు అంత్యక్రియలు సోమవారం స్వగ్రామంలో నిర్వహించగా ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పార్థీవ దేహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ“మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించి నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్‌కౌంటర్‌లకు పాల్పడడం దారుణమైన చర్య” అని వ్యాఖ్యానించారు. అడవులలో నివసిస్తున్న ఆదివాసులను బలవంతంగా వెలివేసి, వారి భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మావోయి స్టులు పేదల కోసం, హక్కుల కోసం పోరాడుతున్నారాణి, వారి డిమాండ్లను పరిష్కరిస్తే వారే స్వచ్ఛందంగా జన ప్రవాహంలో కలిసిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,భాస్కర్ కుటుంబసభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment