పోలింగ్ స్టేషన్లను సందర్శించిన అదనపు కలెక్టర్
వెంకటాపురం, డిసెంబర్12, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక, తిప్పాపురం, మహా ముత్తారం లోని పోలింగ్ స్టేషన్ లను మంగళవారం అదనపు కలెక్టర్ (రెవిన్యూ) డి. వేణుగోపాల్ సందర్శించారు. అనంతరం జడ్పీహెచ్ఎస్ ఆలుబాకలో విద్యా ర్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తల్లిదండ్రులను సంప్రదించాలని, సరైన కారణాలు తెలుసుకొని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సమ్మయ్య, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.