తపాలా సేవల్లో నూతన అధ్యాయం

తపాలా సేవల్లో నూతన అధ్యాయం

తపాలా సేవల్లో నూతన అధ్యాయం

– ములుగులో ప్రారంభం కానున్న ‘ఇండియా పోస్ట్ 2.0’

– జూలై 22 నుంచి అమలులోకి, తాత్కాలికంగా లావాదేవీలకు విరామం

ఏటూరునాగారం, జూలై17, తెలంగాణజ్యోతి:ములుగుజిల్లా లో తపాలా సేవలు మరింత ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి ‘ఇండియా పోస్ట్ 2.0’ సాంకేతికతను జిల్లాలోని అన్ని తపాలా కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు ములుగు పోస్టల్ ఇన్స్పెక్టర్ దయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 6 సబ్ పోస్ట్ ఆఫీసులు, 85 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో నూతన టెక్నాలజీ అమలవుతుందని పేర్కొన్నారు. ఈ పరికరాల ఏర్పాటు, సాంకేతిక సమీకరణ పనులు జూలై 18, 19 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కారణంగా జూలై 21వ తేదీ వరకు తపాలా సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొనడం జరిగింది. కొత్త వ్యవస్థతో గ్రామీణ ప్రజలకు వేగవంతమైన, సమర్ధవంతమైన సేవలు అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment