గంజాయి పట్టివేత – నలుగురిపై కేసు నమోదు
వెంకటాపురం, జూన్ 29, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని బీసీ మర్రిగూడెం శివారులో గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు గాలింపు నిర్వహించిన పోలీసులు, అనుమానాస్పదంగా తిరుగుతున్న సాధనపల్లి మౌళి, సంఖ్యా ప్రశాంత్ కుమార్, గుండమల్ల రోహిత్, చిడం శివరాం లను పట్టుకొని విచారించారు. మరో వ్యక్తి కుర్సాం నీల మణికంఠ పరారీలో ఉన్నాడు. వీరిదగ్గర నుండి 1.186 కేజీల గంజాయి (విలువ రూ.59,300/-) స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కొనుగోలు చేసి, స్థానికంగా అమ్మేందుకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అరెస్టు చేసిన నలుగురిని రిమాండ్కు తరలించారు. గంజాయి వాడకం, విక్రయం, సంచయం లేదా సహకారానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, ఎస్ఐ కే. తిరుపతిరావు హెచ్చరించారు.