కాళేశ్వరాలయానికి శని త్రయోదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు

Written by telangana jyothi

Published on:

కాళేశ్వరాలయానికి శని త్రయోదశి సందర్భంగా పోటెత్తిన భక్తులు

కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోని అనుబంధ దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల వద్ద శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరి లో పుణ్య స్నానాలు ఆచరించి కాలసర్ప, శని నివారణ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు గోదావరి తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది.శని త్రయోదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రావడం వలన ఇట్టి పూజల ద్వారా ఆలయానికి 4,19,390 ఆదాయం చేకూరింది.

మహాదేవపూర్ మండల ప్రతినిధి/ఆరవెల్లి సంపత్ కుమార్.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now