ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు.. జీవితం కి ఆధారమైన భీమా…
భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ నల్లపురి హరికృష్ణ
కాటారం, జూలై 25,తెలంగాణ జ్యోతి : ప్రతి ఒక్కరికి కనీసం అవసరాలు అయినా కూడు గూడు గుడ్డతో పాటు జీవిత భీమా కూడా తప్పని సరి అని ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎన్ హరికృష్ణ తెలిపారు. ఇటీవల ఆకస్మాత్తుగా కాటారం మండల కేంద్రంకి చెందిన ఎస్ కే సబ్దార్ అనే వ్యక్తి గుండెపోటు తో మృతి చెందడం జరిగింది. సబ్దార్ రూ. 50 వేల ప్రీమియం తో ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు లో స్మార్ట్ స్కాలర్ పాలసీ తీసుకున్నారన్నారు. సబ్దార్ ఆకస్మికంగా మృతి చెందడంతో నామిని భార్య సోని కి 5 లక్షల రూపాయల జీవిత భీమా మొత్తాన్ని అందచేశారు. అంతే కాకుండా పాలసీ కొనసాగుతుందని సబ్దార్ చెల్లించవలసిన మిగిలిన వాయిదాలు కూడా తమ కంపెనీ చెల్లించి మెచ్యూరిటీ మొత్తం చివరికి ఇవ్వడం జరుగుతుందని మేనేజర్ హరికృష్ణ తెలిపారు. ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు లో చిల్డ్రన్ పాలసీ లతో పాటు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, పెన్షన్, టర్మ్ ప్లాన్స్, ట్రెడిషనల్ ప్లాన్స్ కూడా అందు బాటులో ఉన్నాయని దీనిని ప్రతి ఒక్కరు తమ అవసరాలకు మేరకు జీవిత భీమా పాలసీ లను ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్సు ద్వారా పొందవలసిందిగా వారు కోరారు. ఈ సందర్బంగా లైఫ్ మిత్ర గురువారెడ్డి మాట్లాడుతూ సబ్దార్ తనకేంతో ఆప్తుడు అని వారి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని వారి కుటుం బానికి భీమా సౌకర్యంతో ఆర్థిక భద్రత కల్పించినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ మేనేజర్స్ మాసు రమేష్, డోలి రామక్రిష్ణ, మల్లారపు మొండయ్య, కస్తూరి సాయికృష్ణ, బ్రాంచ్ లైఫ్ మిత్రలు గురువారెడ్డి, దేశిని శంకర్, బొడ్డు రాజబాబు, సుంకరి కుమార్, పబ్బ నాగరాజు, గోక విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.