మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అశోక్ నియామకం
మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహాదేవపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, ఏఐసీసీ సెక్రెటరీ దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమాక పత్రం అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ఎంపీపీ రాణి బాయి, కాలేశ్వరం ఎంపీటీసీ మమత-నాగరాజ్, వార్డు సభ్యురాలు స్వరూప, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి/ఆరవెల్లి సంపత్ కుమార్.