బస్సులో పోగొట్టుకున్న భూమి డాక్యుమెంట్లు
- రైతు బాబురావు
ములుగు, జూన్ 30, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా అబ్బాపూర్కు చెందిన రైతు యార బాబురావు భూమికి సంబంధించిన ముఖ్యమైన రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్లను బస్సులో ప్రయాణించేటప్పుడు పోగొట్టుకున్న ఘటన వెలుగు లోకి వచ్చింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్కు చెందిన ముస్కుల నర్సింహరెడ్డి, ముస్కుల రవీందర్ రెడ్డి లకు చెందిన భూమిని గీసుకొండ మండలం కొమ్మాల గ్రామానికి చెందిన మండల రవి వారితో కొనుగోలు చేశారు. ఆ తర్వాత వరంగల్ బొల్లికుంట ఏరియాలో ఉన్న 234 చదరపు గజాల ప్లాట్ను బాబురావు కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ నంబర్ 5647/2019ను అతనికి అప్పగిం చారు. అయితే ఇటీవల అబ్బాపూర్ నుంచి ములుగు బస్సులో ప్రయాణిస్తూ ఉండగా ఆ డాక్యుమెంట్లను పోగొట్టుకున్నానని బాబురావు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పత్రాలు ఎవరికైనా దొరికితే, దయచేసి 7569030926 నెంబర్కు ఫోన్ చేసి తెలియజేసి సహకరించాలని రైతు బాబురావు విజ్ఞప్తి చేస్తున్నారు.