గిరిజనులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేసిన ఏటూరునాగారం పోలీసులు
- వర్షాకాలాన్ని పురస్కరించుకొని మానవతా కార్యక్రమం
ఏటూరునాగారం, జూన్ 28, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని వీరాపురం గ్రామం గుత్తి కోయ గిరిజన గుంపులో శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, వర్షాల వల్ల గిరిజనులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నివారణకు ముందస్తు జాగ్రత్తలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ రాజకుమార్ల నేతృత్వంలో గిరిజనులకు దుస్తులు మరియు రైన్ కోట్ కవర్స్ పంపిణీ చేశారు. వర్షాకాలంలో గిరిజనులు ఎదుర్కొనే జలవాతావరణ ప్రభావం నుండి రక్షించేందుకు పోలీస్ శాఖ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. పోలీసుల ఈ మానవతా చర్య స్థానికంగా విశేష స్పందన పొందింది. గ్రామస్తులు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ, తమపై పోలీసుల శ్రద్ధ గమనార్హమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ సామాజిక బాధ్యతగా ముందుండి చేసిన ఈ కార్యక్రమం గిరిజనుల్లో కొత్త ఆశ, నమ్మకాన్ని నింపిందని పలువురు అభి ప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ భార్గవ్, కానిస్టేబుళ్లు శోభన్, గోపి, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.