విఆర్కెఫురం లో మత్స్యకారుల దినోత్సవం.
- ఘనంగా జండా ఆవిష్కరణ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ పరిధిలోని చొక్కాల గ్రామంలో మంగళవారం పెద్ద ఎత్తున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాడబలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో, జెండా ఆవిష్కరించి మత్స్యకారుల ఐక్యత వర్ధిల్లాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర యువ నాయకులు డర్ర దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా వాడ బలిజ కులస్తులు గోదావరి పరివాహక ప్రాంతం ఇరువైపులా నివసిస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో స్వతంత్రం రాక ముందు నుండి మా తాతలు, ముత్తాతలు ఈ ప్రాంతంలో సాంప్రదాయ మత్స్యకారులుగా నివసిస్తున్నారని తెలిపారు. దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాడబలిజ కులస్తులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వాడబలిజ కులస్తులను గుర్తించి ప్రభుత్వం ఇస్తున్న టువంటి బీసీ బందులో వాడబలిజ కులస్తులకు చేర్చాలని, ఈ ప్రాంతంలో వాడబలిజ మత్స్యకారుల నిరుపేద పిల్లలకు ప్రతి మండలానికి వాడబలిజ మత్స్యకార గురుకులం ఏర్పాటు చేయా లని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని చెరువులు, కుంటలు గోదావరిలో వేసే చేప పిల్లల పెంపకంపై గిరిజన సోదరులతో సమానంగా సాంప్రదాయ మత్స్యకారులమైన మా వాడబలిజ కులస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కేటాయిం చాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోస్టల్ ద్వారా ఇస్తున్నటు వంటి పట్టాదారు పాస్ పుస్తకాలను పొందేందుకు హక్కులు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొప్పుల మల్లయ్య, సనుగొండ వెంకన్న, బొల్లె మల్లయ్య, వాదం వెంకన్న, బద్ది రాంబాబు, నాగేంద్ర బాబు, రవి, మల్లికార్జున్, శ్రావణ్, రాజు, సారయ్య, సమ్మయ్య, ఆదినారాయణ,రవిచంద్రమూర్తి, మల్లయ్య, రాము, నరసింహా రావు, తదితర మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.