అధికారుల సమన్వయంతో సమస్యలు పరిష్కారిస్తాం
– యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్
ఏటూరునాగారం, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం, రోహీర్ గ్రామాలలో జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ అనుముల శ్రీనివాస్ ల సూచనల మేరకు శుక్రవారం ఎస్సై తాజుద్దిన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామసభలు నిర్వహించారు. గ్రామాలలో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఏలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సంబందిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామన్నారు. రొహీర్ గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ సమస్య తలెత్తడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు విన్నవించ డంతో విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి 15 రోజులలో సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో సైడ్ కాల్వల శుభ్రత, క్రీడా మైదానం అభివృద్ధి కోసం కృషి చేయాలని గ్రామస్తులు కోరారు. ప్రజల సమస్యలే తమ సమస్యలుగా భావించి గ్రామ అభివృద్ధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భాగస్వా ములం అవుతామన్నారు. అంతేకాకుండా గ్రామంలో నిషేదిత గంజాయి లాంటి మత్తు పదార్థలకు ఎవరు బానిస కాకుడదని ప్రభుత్వ నిషేదిత మాధక ద్రవ్యాలను వినియోగించి న, విక్రయించిన చట్టపరంగా శిక్షార్హులౌతారన్నారు. ఎలాంటి సమస్యలున్నా పోలీసు శాఖకు సమాచారం అందించాలని గ్రామ సభలో ఎస్సై తాజుద్దిన్ ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.