మేమున్నాం.. దేశం కోసం పోరాటం చేయాలే…
– పార్టీలు, కులాలుగా విడిపోయినా దేశం కోసం మేమంతా ఒక్కటే
– తీవ్రవాదులను మట్టుపెట్టి దేశ ఔన్నత్యాన్ని చాటుతున్నరు
– సైనికుల పోరాట స్పూర్తి సైన్యంలో చేరాలనే బావన కల్గిస్తోంది
– సంఘీబావ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
కాటారం, తెలంగాణ జ్యోతి : బారత దేశం ఔన్నత్యం చాటుతూ, పౌరుషాన్ని చూపుతూ పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టు పెడుతున్న వీర సైనికులకు మేమున్నామని, దేశం కోసం పోరాటం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథని నియోజకవర్గ భీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం భారత జవాన్లకు సంఘీభావంగా మంథని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే చౌక్ నుంచి చాకలి ఐలమ్మ చౌక్ మీదిగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో విభిన్నమైన మతాలు కులాలు బాషలు ఉన్నాఈ దేశం మట్టి గొప్పతనాన్ని చాటుతూ ప్రతి పౌరుడు హింసలేకుండా అహింసామార్గంలో జీవిస్తుంటే పాకిస్తాన్లోని తీవ్రవాదులు హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నారని అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయంగా మారిందని, అక్కడ స్థావరాలకు అడ్డగా ఏర్పాటు చేసుకుని దేశాన్ని ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అయితే ఏప్రిల్ 22న జరిగిన సంఘటనకు ధీటుగా దేశ సైనికులు తీవ్రవాదులను మట్టుబెట్టారని, ఈ దాడిలో సామాన్యులకు, దేశ సంపదకు ఎలాంటి నష్టం జరుగ కుండా చూశారన్నారు. దేశంలో పార్టీలు కులాలుగా విడిపోయి నా దేశ సంఘటితం, పటిష్టత కోసం ఏకతాటిపైకి వస్తామని ఈనాడు మూలమూలల నుంచి ప్రజలు సందేశం ఇస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారంటూ ఈనాడు మంథనిలో సైతం అన్ని వర్గాలప్రజలు వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను మూసివేసి సైనికులకు సంఘీ బావం తెలుపారని ఆయన అన్నారు. ప్రజల సంఘీబావాన్ని సైనికులు స్వీకరిస్తూ బార్డర్లో తీవ్రవాదుల కుట్రలను తిప్పి కొడుతున్నారని, వారి పోరాట స్పూర్తితో మనం కూడా సైన్యంలో ఎందుకు చేరకూడదనే బావన ప్రతి ఒక్కరిలో కల్గుతోందన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు తమ బార్యాపిల్లలను, సమాజాన్ని వదిలి కాపలాగా ఉండటంతోనే ఈనాడు మనం సంతోషంగా ఉంటున్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. మనకు రక్షణగా ఉండే సైనికులకు ఎన్ని విధాలుగా సంఘీబావం తెలిపినా తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్లోని తీవ్రవాద స్థావరాలను అంతం చేసే వరకు దేశ సైనికులు పోరాటం కొనసాగించాలని ఆయన అన్నారు. అనంతరం పాకిస్తాన్ తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన తెలుగు బిడ్డ మురళీధర్ నాయక్తో పాటు పహల్గాంలో తీవ్రవాదులు హతమార్చిన టూరిస్టులకు ఆయన ఈ సందర్బంగా ఘన నివాళులు అర్పించి సంతాపం తెలిపారు.