వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

Written by telangana jyothi

Published on:

వాడవాడలా మువ్వన్నెల రెపరెపలు

– గ్రామ, గ్రామాన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 

– వెల్లివిరిసిన దేశభక్తి, జాతీయ జెండాలతో ర్యాలీలు. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా, గ్రామ గ్రామాన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు,రాజకీయ పార్టీ లు, సంఘాలు, ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేసి బోలో స్వతంత్ర భారత్ కి జై అంటూ దేశభక్తి గీతాలతో జేజేలు పలికారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రధాన రహదారులపై దేశభక్తి నినాదాలతో భారీ ర్యాలీ లు నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు కుల సంఘాలు ఆటో వర్కర్స్ యూనియన్, ఆర్యవైశ్య సంఘం, ఇంకా అనేక సంఘాలతో పాటు గ్రామపంచాయతీ కార్యాలయాలు లో జాతీయ జెండాలు ఎగరవేశారు. రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో, ఫారెస్ట్ కార్యాలయంలో అటవీ శాఖ అధికారి, సొసైటీ కార్యాలయంలో అధ్యక్షులు చిడెం మోహన్ రావు లు జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే జిసిసి, పోలీస్ స్టేషన్, ఐసీడీఎస్ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా జాతీయ జెండాల ఎగరవేసి మిఠాయిలను పంపిణీ చేశారు. వెంకటాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు జాతీయ జెండా ఎగురవేశారు. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో హెచ్ఎం ఆర్.వి.వి సత్యనారాయణ,మిగతా ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా హెచ్.ఎంలు జాతీయ జెండాలను ఎగరవేశారు. మహిళా సంఘాలు వేర్వేరుగా జాతీయ జెండాలను ఎగురవేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now