బాధిత కుటుంబానికి అండగా చక్రవర్తిపల్లి గ్రామస్తులు

Written by telangana jyothi

Published on:

బాధిత కుటుంబానికి అండగా చక్రవర్తిపల్లి గ్రామస్తులు

వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : చక్రవర్తి పల్లి గ్రామపంచాయితీ పరిధి ఆనందాపూర్ లో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన భూక్య సమ్మయ్య మరణించగా గ్రామస్తులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. శనివారం సాయంత్రం గ్రామస్తులంతా కలిసి 21,500 ల రూపాయలను సమ్మయ్య కుమారుడు సిద్దుకు అందించారు. కష్టాల్లో ఉన్న తోటి వ్యక్తికి ఆసరాగా నిలిచేందుకు గ్రామస్తులంతా అప్పటికప్పుడు తమ వంతు సహకారం అందించడం పట్ల ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. కార్యక్రమం లో చక్రవర్తి పల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now