ఐటీడీఏ పీవో కు ఆహ్వాన పత్రికను అందించిన ఐలాపూర్ గ్రామస్థులు
తెలంగాణ జ్యోతి,కన్నాయిగూడెం : ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలం ఐలాపూర్ లో వచ్చే నెల ఫిబ్రవరి 12 నుండి 14 వరకు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏటూ రునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రాని సోమవారం ఆహ్వానిస్తూ పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పూజారి సంఘం అధ్యక్షుడు మల్లెల రవి, పీరీల భాస్కర్, పులిశ బాలు, తిరు పతి, సురేష్, పొడెం బాబు, ఆలం రాంబాబు పాల్గొన్నారు.