కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది

కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది

కార్పొరేట్ కంపెనీలకు ఇసుక క్వారీలను కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది

– ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మండిపాటు

వెంకటాపురంనూగూరు,తెలంగాణజ్యోతి : షెడ్యూల్ ప్రాంతం లోని నీళ్లు, నిధులను కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాలు బంది పోట్ల వలే దోచు కుంటున్నారని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. సోమవారం ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ ఇసుక పరస్పర సహకార సంఘాలు ధర్నా కార్యక్రమం నిర్వహించాయి.ఏజెన్సీ జిల్లా అయిన ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెము మండలాలకు చెందిన ఇసుక సొసైటి లు ఈ ధర్నా కార్యక్రమం పాల్గొన్నాయి. ఈ మేరకు వెంకటాపురంలో ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రాంతం లో ఉన్న గోదావరినదిలోని ఇసుకను కారు చౌకగా ప్రభుత్వం కాజెస్తోందని నర్సింహా మూర్తి ఆరోపించారు. ప్రభుత్వం తేనున్న నూతన ఇసుక పాలసీ షెడ్యూల్ చట్టాలు అయిన ఎల్ టి ఆర్, పేసా చట్టాలను కాల రాసి, ఆదివాసీలకు అన్యాయం చేసేలాగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మైన్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం లోని సెక్షన్ 11(5) ప్రకారం ఐదో షెడ్యూల్ ఏరియాలో, ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తులు మైనింగ్ చేసే అధికారం లేదని చెప్తోందని అన్నారు. ఎల్టిఆర్ చట్టంలోని సెక్షన్ 3(1)(ల్యాండ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ) ప్రకారం ప్రభుత్వం లేదా ఇతరులు ఎటువంటి మైనింగ్ అధికారాలు కలిగి లేరని చట్టం చెప్తోందన్నారు .రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన ఐదో షెడ్యూల్ ప్రాంతం లో ప్రభుత్వం లేదా ఇతరులు మైనింగ్ చేసే అధికారం కలిగి లేరని, ప్రభుత్వం కూడా గిరిజనేతరుడే అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో దేశ సర్వోన్నత రాజ్యాంగ ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చిందని ఆయన ప్రభుత్వానికి గుర్తు చేశారు. షెడ్యూల్ ఏరియాలో గిరిజన సహకార సంఘాలకు మాత్రమే మైనింగ్ చేసే అధికారం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఇసుక పాలసీ వల్ల గిరిజన సహకార సంఘాలకు తీవ్ర అన్యాయం జరిగేదిగా ఉందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు మైనింగ్ అనుమతులు ఇచ్చే విధంగా నూతన విధానాన్ని రూపొందించారని అన్నారు.నూతన ఇసుక పాలసీ ని షెడ్యూల్ ఏరియాలో అమలు చేయవద్దని ప్రభ్యత్వాన్ని కోరినారు. ఇది రాజ్యాంగ వ్యతిరేఖ చర్య అన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రభుత్వ ఖజానాకు ప్రతి యేటా ఇసుక నుండి రెండు వేల కోట్ల రూపాయలు చేరుతొందని తెలిపారు. 2013 లో అప్పటి ధరలకు అనుగుణంగా ఒక క్యూబిక్ మీటర్ కు రెండు వందల ఇరవై రూపాయలు నిర్ణయించారని అన్నారు. పెరిగిన ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఒక క్యూబిక్ మీటర్ కు 450 రూపాయలకు పెంచాలని గిరిజన సహకార సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా క్యూబిక్ మీటర్ కు 600 రుపాయలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మైనింగ్ ద్వారా సీనరేజ్ ముప్పై శాతం వస్తోందని అన్నారు. సీనరేజ్ నిధులను గత ప్రభుత్వం (డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ ) గా మార్చి ఆ నిధులను జిల్లాలోని అన్ని మండలాలకు కలెక్టర్ వినియోగిస్తున్నారని తెలిపారు. రద్దు చేసి ఇసుక మైనింగ్ జరిగే ప్రభావిత ప్రాంత స్థానిక గ్రామపంచాయతీ లకు సీనరేజ్ నిధులను కేటాయించడం ద్వారా న్యాయం జరుగుతుందని వారు అన్నారు. ఇసుక తీయడం ద్వారా భూ గర్భ జలాలు అడుగంటి పోతున్నాయని అన్నారు. స్థానికంగా త్రాగు నీటి, సాగు నీటి బోరు బావులు ఎండి పోతున్నాయని తెలిపారు. దీన్ని ఆదిగమించడానికి నీటి కుంటలు కట్టడం, చిన్న ప్రవాహలకు అడ్డుకట్ట వేయడం, ఇంకుడు గుంతలు తవ్వించడం వంటి కార్యకలాపాలు చేయడం ద్వారా భూ గర్భ జలాలను స్థిరకరించ వచ్చని తెలియజేసారు. ఐదో షెడ్యూల్ ఏరియాలో పేసా గ్రామసభ లదే అంతిమ నిర్ణయం అన్నారు. కార్పొరేట్ లకు మైనింగ్ అనుమతులు ఇస్తే వినియోగదారుడి మీద అధిక భారం పడుతుందని అన్నారు. పేసా చట్టాన్ని ఉల్లంఘించి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించు కోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని కొంసాగించాలని, దీని ద్వారా మాత్రమే ఆదివాసీలు ఆర్ధికంగా బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. నాలుగు ఏళ్ల నుండి ఇసుక బిల్లులు ఇవ్వక పోవడం తో గిరిజన సొసైటి లు అప్పుల ఊబిలో కూరక పోయామని అన్నారు. పాత బిల్స్ తక్షణమే మంజూరు చేయాలనీ డిమాండ్ చేసారు. సొసైటీ సభ్యులకు జీతబాత్యాలు చెల్లించాలని అన్నారు. ఎల్ టి ఆర్, పేసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలనీ అన్నారు. కాంట్రాక్టర్ విధానం ద్వారా ఇసుక ను తరలించు కు పోవాలని చుస్తే ఏజెన్సీ ప్రాంతం నుండి ఒక్క ఇసుక రేణువు కూడా తీసుకో పోనిచ్చే ప్రసక్తే లేదని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రజా ప్రభుత్వం లో ఆదివాసీలకు తీరని అన్యాయం జరుగుతోందని ముఖ్య అతిధి ఉష్మానియా యూనివర్సిటీ పిహెచ్ డి స్కాలర్ ఆదివాసీ జేఏసి చైర్మన్ సాగ బోయిన పాపారావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఆస్తిత్వం పైన అభివృద్ధి పునాదులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద కాళ్ళ క్రింద ఉన్నా ఆదివాసీలు ఎప్పటికి పేదవాళ్లే అన్నారు. ఆదివాసీ నవనిర్మాణ సేన చేపట్టిన ధర్నాకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మార్పిఎస్ రాష్ట్ర, జాతీయ నాయకులు మేడి రమణ, నండూరి నర్సింహా, దళిత బహుజన విద్యార్థి సంఘం నాయకులు నవీన్ రాజ్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేసారు. దళితులు ఊరి చివరన ఉంటే ఆదివాసీలు మాత్రం ఆధునిక సమాజానికి దూరంగా ఉంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు చిడెం వివేక్ ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశంలో అత్యంత అన్యాయానికి గురయ్యేది ఆదివాసీలు మాత్రమే అని ఆయన అన్నారు. ఆదివాసీ ముర్రం రాజేష్,కుంజ మహేష్, ముర్రం రామలక్ష్మి, వాసం రజని, సుభద్ర, జ్యోతి,కుమారి,పద్మ, చిలకమ్మా ఏజెన్సీ,వెంకటాపురం, వాజేడు‌ఇతర మండలాల ఆదివాసీలు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment