రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
కాటారం, తెలంగాణ జ్యోతి : దేశంలో భారత రాజ్యాంగం ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆ దిశగా అవగాహన పెంచుకొని కృషి చేయాలని మహదేవ్పూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలోని మల్లంపల్లి గ్రామంలో జై బాబు జై భీమ్ జై సంవిదాన్ నినాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రను స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ నాయకులు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మనువాద సంస్కృతిని ఇచ్చేందుకు కృషి చేస్తుందని బిజెపి, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ కుల మతాత్వాలను పెంచి పోషిస్తుందని కాంగ్రెస్ ఎస్సీ సెల్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు దండు రమేష్ ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిం చాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కరిగే కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు బడితెల రాజయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి జంపయ్య, మండల కాంగ్రెస్ నాయకులు అయిత రాజిరెడ్డి, కొండ రాజమ్మ, మమత, సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, నాయకులు పెనుమండ్ర వామన్ రావు, సహేందర్, కృష్ణమూర్తి, మహేందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షురాలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.