స్వామివార్లను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు జడ్జి.
తెలంగాణ జ్యోతి/కాళేశ్వరం : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీ నామవరపు రాజేశ్వర్ రావు కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించు కున్నారు. వారికి బుర్రి శ్రీనివాస్ సూపరింటెండెంట్ ఆధ్వర్యం లో దేవస్థానం అర్చకులు,వేద పండితులు ఆలయ మర్యాద లతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రములతో వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు జడ్జీలు, కోర్టు సిబ్బంది మరియు డి.ఎస్.పి రాంమోహన్ రెడ్డి, మహదేవపూర్ సీఐ రాజేశ్వర్ రావు, ఎస్సై భవానీ సేన్ పాల్గొన్నారు.