Telangana 10th Results 2025 | పదవ తరగతి ఫలితాల వెల్లడి 

Telangana 10th Results 2025 | పదవ తరగతి ఫలితాల వెల్లడి 

Telangana 10th Results 2025 | పదవ తరగతి ఫలితాల వెల్లడి 

హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 30) విడుదల అయ్యాయి. ఫలితాలకోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధులకు బుధవారం మధ్యాహ్నం  సీఎం  రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 15వ తేదీ నాటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా పూర్తైంది. ఈసారి పదో తరగతి విద్యార్ధులకు గ్రేడ్స్‌ ఇవ్వడానికి బదులు గతంలో మాదిరిగానే విద్యార్ధులకు మార్కులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధాలను రూపొందిం చడంలో జాప్యం నెలకొనడం మూలంగా టెన్త్‌ ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఈ రోజు విడుదల చేసిన ఫలితాల్లో విద్యార్ధులకు వచ్చిన మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్ కూడా ప్రకటించారు. ఈఏడాది రాత పరీక్షలు 80 మార్కులకు, ఇంటర్నల్‌ మార్కులు 20 మార్కులను నిర్వహిం చారు. ఈ మేరకు మార్కుల మెమోలను జారీ చేస్తారు. అలాగే వచ్చే ఏడాది నుంచి టెన్త్‌లో ఇంటర్నల్ మార్కులను కూడా తొలగించి, మొత్తం 6 సబ్జెక్టులకు 100 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.తెలంగాణ టెన్త్‌ ఫలితాలు విడుదల. గతేడాది కంటే 1.47 శాతం అధికం. 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు.

జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి. ఉదయం 9.30గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకు నిర్వహించనున్నారు. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్ కు రూ.500, రీవెరిఫికేషన్కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురుచూడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాయాలని బోర్డు సూచించింది.

ఈ క్రింద క్లిక్ చేసి  ఫలితాలను చూసుకోండి.

https://results.bse.telangana.gov.in

—————————————————-

https://results.cgg.gov.in/bieresultliveNewChanges2025.do

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment