టేకులగూడెం రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం జి.పి. లో జాతీయ రహదారి 163 నుండి గోదావరి నది వరకు,మట్టి రోడ్ నిర్మాణ పనులను గ్రామస్తులు, గ్రామ పెద్దలు శుక్రవారం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ గ్రామానికి గోదావరి ఇసుక సొసైటీ ధ్వరా ఇసుక డంపింగ్ నిమిత్తం ప్రభుత్వం ఇసుక క్వారీ మంజూరు చేసింది. అలాగే ఇందిరమ్మ ఇళ్లు మొత్తం జిపి లోని మూడు గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు 120 వరకు మంజూరు అయ్యాయి. ఇళ్ళ నిర్మాణం నిమిత్తం ఇసుక తోలకం మరియు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, ట్రాక్టర్లు, ఇతర రాకపోకలకు బహుళ ప్రయోజనాల నిమిత్తం మరియు ఇసుక సొసైటీ లారీల రాక పోకలు, రైతుల అవసరాల కోసం, బహుళ ప్రయోజనాలు నిమిత్తం గోదావరి నుండి 163 జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణ పనుల కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పీసా ఉపాధ్యక్షులు కుర్సం శ్రీనివాసరావు, ఇసుక క్వారీ సొసైటీ అధ్యక్షురాలు శ్రీలత, గ్రామ పెద్దలు కుర్సం దక్షిణామూర్తి, వాసం రవి, యూత్ నుండి వికాస్, కోడె రవి, ఇంకా పలువురు గ్రామ పెద్దలు, యూత్, ఇసుక సొసైటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.