వెంకటాపురం చేరిన స్వామీజీ పాదయాత్ర.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మహారాష్ట్రకు చెందిన స్వామీజీ శ్రీ బాలవికాస్ మహారాజ్ ధర్మ ప్రచారంలో భాగంగా, గోదావరి నది తీరం పరివాహ ప్రాంతాల్లో జరుగుతున్న పాదయాత్ర ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం చేరుకుంది. సుమారు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన పాద యాత్ర నాసిక్ త్రియంబకం గోదావరి నది మాత పుట్టిన ప్రాంతం నుండి గోదావరి పరివాహక ప్రాంతం గుండా, వెంకటాపురం మీదు గా భద్రాచలం చెరుకుంటుందని స్వామిజి తెలిపారు. అక్కడి నుండి రాజమండ్రి నరసాపురం వరకు కొనసాగి, ధర్మ ప్రచారం పాదయాత్ర ముగు స్తుందని స్వామీజీ శ్రీ బాలదాస్ మహారాజ్ తెలిపారు. సుమారు 3,000 వేల కిలోమీటర్ల పైగా తన శిష్య బృందంతో పాదయాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివిధ పుణ్యక్షేత్రాల దర్శించి, పూజలు నిర్వహించి బస చేసి మరల పాదయాత్ర తో గమ్యం చేరతామని తెలిపారు. ధర్మ ప్రచారంతో సకలజనులు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ పాద యాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. దేవాలయాలు, పుణ్య క్షేత్రాలలో బసజేస్తూ మరుసటి రోజు వేకువజామునే పాదయాత్రను కొనసాగిస్తూ రాజమండ్రి సమీపం లో లోనీ నరసాపురం వరకు గోదావరి నది మాత దర్శనంతో తమ పాదయాత్ర ధర్మ ప్రచారం ముగుస్తుందని తెలిపారు. స్వామీజీ వెంట బాలక్ దాస్, సోమల్దాస్, రాయలకన్ తదితర ఉప స్వామీజీలు,శిష్యులు వున్నారు. అయోధ్య శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో జై శ్రీరామ జై జై శ్రీరామ అంటూ పాదయాత్రను కొనసాగిస్తున్నట్లు తెలిపారు .
1 thought on “వెంకటాపురం చేరిన స్వామీజీ పాదయాత్ర. ”