వెంకటాపురం హైస్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి జి వి వి సత్యనారాయణ సమ్మర్ క్యాంప్-2025 ప్రారంభించారు. ఈ క్యాంప్ నేటి నుండి 26 వ తేదీ వరకు 15 రోజుల పాటు ఉదయం 9.00 నుండి 11.00 గంటల వరకు నిర్వహించ బడుతుందని తెలిపారు. 6 నుండి 9 వ తరగతి వరకు చదివే అందరు విద్యార్థులు వినియోగించు కోవాల న్నారు. ఈ క్యాంప్ లో ఆటలు, పాటలు, డ్రాయింగ్, యోగా, కరాటే, డాన్స్, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీషు మొదలైన అంశాలు నేర్పించబడు తాయన్నారు.ఈ క్యాంప్ ను శేష నరసింహారావు, పి.సూర్య నారాయణ, బి. శ్రీనివాస్ లు నిర్వహిస్తారని ఎంఇఓ తెలిపారు.