సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు పటిష్ట కార్యాచరణ

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు పటిష్ట కార్యాచరణ

– మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి

– ప్రారంభించిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి*

– ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకొని యూసి లను సమర్పించాలి*

– కాటారం మండల తహసీల్దార్ కార్యాలయం లో నిర్వహించిన రివ్యూ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: ప్రజల సౌకర్యార్థం చేపట్టి న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేందుకు పటిష్టంగా కార్యాచరణ అమలు చేయాలని, అందుబాటులో ఉన్న నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. మంగళవారం కాటారం మండ లంలోని తహసిల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని అసెంబ్లీ నియోజక వర్గా నికి సంబంధించి 5 మండలాలలో చేపట్టిన అభివృద్ధి పనుల పురో గతి పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జిల్లాలో గల ఐదు మండలాలలో సిడిపి, డి.ఎం.ఎఫ్.టి, ఎస్.డి.ఎఫ్., నీతి ఆయోగ్ కింద అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు సంపూర్ణంగా వినియోగించుకొని నిర్దేశిత సమయంలో సకా లంలో అభివృద్ధి పనులు పూర్తయ్యే విధంగా కార్యాచరణ అవలం బించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో పనులు ప్రారంభించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసు కోవాలని, త్వరితగతిన మిగిలిన అభివృద్ధి పనులను ప్రారంభించి రెండు, మూడు నెలలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మంజూరు చేసిన నిధులను సంపూర్ణంగా వినియో గించుకొని అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, పూర్తి చేసిన అభి వృద్ధి పనులకు సంబంధించి యూసీ లను సకాలంలో సమర్పించా లని కలెక్టర్ తెలిపారు. మంథని అసెంబ్లీ నియోజకవర్గానికి సంబం ధించి 5 మండలాల్లో 2020-22 సంవత్సరానికి చెందిన సి.డి.పి పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేసి యూసీలో ఎంబి రికార్డులు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవ సరమైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టిన బస్టాండ్ లో మౌలిక వసతులు, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్, సిసి రోడ్లు వైకుంఠ ధామాలు మొదలగు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎస్.డి.ఎఫ్ కింద కాలేశ్వరం ఆలయం వద్ద చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని, భక్తుల సౌక ర్యార్థం అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసి వారికి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కాళేశ్వరం ఆలయం వద్ద నిర్మించిన భవనంలో గదులకు విద్యుత్ సౌకర్యం, సెప్టిక్ ట్యాంక్ మొదలగు సౌకర్యాలు కల్పించి, అవి ఉపయోగంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మంథని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు. సర్వే నెంబర్ 418, 501 లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించే త్వరలో 200 మంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశం లో కాటారం అర్.డి.ఓ డా. నారాయణ, మహముత్తారం జెడ్ పి టి సి లింగమల్ల శారద, మహాదేవపూర్ జెడ్ పి టి సి గుడాల అరుణ, మల్హర్ మండల జెడ్ పి టి సి ఐత కోమల, మహాదేవ పూర్, మలహర్ ఎంపి పిలు బన్సొడ రాణీ బాయి రామారావు, మలాల్ రావు, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ అధికారులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “సకాలంలో అభివృద్ధి పనులు పూర్తయ్యేందుకు పటిష్ట కార్యాచరణ”

Leave a comment