Ssc results : కాసేపట్లో పదవ తరగతి ఫలితాలు విడుదల
డెస్క్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. 30వ తేదీ (నేడు) ఉదయం 11గంటలకు తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్టు సెకండరీ బోర్డు ప్రకటించింది. విద్యా శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేయ నున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలను 2,676 కేంద్రాలలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగగా 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష లకు ఫీజులు చెల్లించారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగత పరీక్షల కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వహించగా ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితా లను వెల్లడించనున్నారు.