శ్రీరామనవమి సందర్భంగా పురవీధులలో పల్లకిలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి
– భక్తుల నీరాజనాలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవలో మంగళ వాయిద్యాలు, కాగడాల వెలుతురులో ఆదివారం సాయంత్రం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్తులు శుద్ధి జలంతో స్వామివారికి స్వాగతం పలికి, పసుపు, కుంకాలు టెంకాయలు పుష్పాలతో పూజలు నిర్వహించి, స్వామి వారి ఆలయ ఆస్థాన పురోహితుడి మంత్రోచ్ఛరణలతో ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వెంకటాపురం పట్టణంలోని మార్కెట్ సెంటర్, బస్టాండ్ సెంటర్, ప్రధాన వీధులలో స్వామివారు పల్లకి సేవలో ఊరేగుతూ భక్తుల నుండి భక్తిరస నిరాజనాలను అందు కున్నారు.