క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : హోప్ స్వచ్ఛంద సంస్థ మంగపేట ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ములుగు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఏటూరు నాగారం సి ఐ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, క్రీడల తో స్నేహ సంబం ధాలు పెంచుకోవచ్చని తెలిపారు. హోప్ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఈ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజయ వంతం గా పూర్తి అవడానికి క్రీడాకారులు సహకరించా లని కోరారు. హోప్ స్వచ్ఛంద సంస్థ ప్రజల కి ఉపయోగ పడే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సయ్య ద్ ఖలీద్,ఏటూరునాగారం, మంగపేట యస్ ఐ లు తాజు ద్దీన్,టివిఆర్.సూరి,జిల్లా మైనారిటీ అధ్యక్షులు అయ్యుబ్ ,మండల అధ్యక్షులు చిట్టమట రఘు జిల్లా కో ఆప్షన్ మెంబెర్ వాలియాబీ సలీం, హోప్ ప్రధాన కార్యదర్శి ఫయాజ్, ఉపాధ్యక్షులు మినహాజ్, హోప్ సభ్యులుప్రశాం త్, రవితేజ, రియాజ్, అన్వార్, షారు, ఇర్ఫాన్, తరుణ్, షహీద్ సుమన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.