కాలేశ్వరాలయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు

Written by telangana jyothi

Published on:

కాలేశ్వరాలయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు

కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని సుప్రీం కోర్ట్ మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ దంపతులు దర్శించు కున్నారు. ముందుగా వారికి అర్చకులు రాజగోపురం నుండి పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి వారి ఆలయంలో అభిషేకం,అమ్మవారి ఆలయంలో దర్శనం అనంతరం అర్చక స్వాములు స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నీటి పారుదల శాఖ సెక్రెటరి ప్రశాంత్ పాటిల్ మరియు వివిధ శాఖ అధికారులు, ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

2 thoughts on “కాలేశ్వరాలయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దంపతులు ప్రత్యేక పూజలు”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now