భూభారతితో సమస్యల పరిష్కారం సులభం

భూభారతితో సమస్యల పరిష్కారం సులభం

భూభారతితో సమస్యల పరిష్కారం సులభం

– అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాటారం, తెలంగాణ జ్యోతి : భూ భారతి చట్టంతో రైతులకు భూ సమస్యల పరిష్కారానికి సులభం మార్గంగా ఉంటుందని, భూముల హక్కులు భద్రంతో పాటు భూ సమస్యలు సత్వర పరిష్కారం జరుగుతాయని, రైతుల మేలుకోసం ప్రజాపాలనలో చారిత్రక మార్పు అని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏ.ఎస్.ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన భూ భారతి నూతన ఆర్ ఓ ఆర్ చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి చట్టంలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ తల్లి దండ్రుల తర్వాత భూమి ప్రజలకు మరొక తల్లి తండ్రి అని భూమికి అన్ని హక్కులు కల్పించే విధంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, రెవెన్యూ అధికారులు పనిచేయడం లేదని అసత్య ప్రచారం చేసి ప్రజల్లో అధికారులను చులకన చేసారని తెలిపారు. ధరణి వల్ల పట్టాలు కాక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో పటిష్టమైన ఉన్నపుడు పట్వారి వ్యవస్థ ఉండేదని రకం రశీదును ఆధారంగా తీసుకొని అమ్ముకున్న, కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తుల వివరాలు పహణి లో పక్కాగా నమోదు చేసేవారని అన్నారు. ప్రతి సంవత్సరం జమాబంది చేసి పట్టాకాలంలో కొనుగోలు దారు పేర్లు ఎక్కించడం వల్ల భూమి హక్కులు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వాహయంలో ధరణి పేరుతో ప్రజల భూములను దగా, దోపిడీ చేశారని, అనేక అక్రమాలు చేసి, వాళ్ళ కడుపులు నింపు కున్నారు తప్ప పేదలకు న్యాయం చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని బంగాళా ఖాతంలో వేసి రైతులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం, రైతులకు ఒక ఆదర్శవంతమైన చట్టాన్ని తీసుకొచ్చా మని తెలిపారు. భూ మాత చట్టాన్ని 9 మంది సీనియర్ అధికారులతో కమిటీ వేసి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి కష్టపడి ప్రజలకు అనుకూల మైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని, వాటిని క్రోడీకరించి ఇంకేమైనా చట్టంలో జత చేయాల్సిన విషయాలు ఉంటే జాతచేస్తామని తెలిపారు. తదుపరి మన జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ భారతిలో చేర్చి రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా పట్టాలివ్వాలి, హక్కులు కల్పించే విధంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ధరణి వల్ల రైతులు కార్యాలయాలు చుట్టూ తిరిగి విసిగి వేసారి, అధికారుల మీద పెట్రోల్ పోసిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ధరణి వల్ల ప్రజలు నానా అవస్థలు పడ్డారని తెలిపారు. కొత్తపల్లి గ్రామంలో సుమారు 70 సంవత్స రాలు నుండి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు, పాస్ బుక్ రాకపోవడం వల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంక్ రుణాలు రాక అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ లేక పేద రైతులు అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దున్నుకునే రైతులకు పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, నూతన చట్టం ప్రకారం అన్ని హక్కులు కల్పిస్తామని తెలిపారు. 30 రోజుల భూ సమస్యలు తహసిల్దార్ పరిష్కరించే విధంగా చట్టంలో పొందుపరిచినట్లు తెలిపారు. 30 రోజుల్లో తహసిల్దారు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆటోమేటిక్ గా భూ భారతిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు. తహసిల్దారు మీద ఆర్డీవోకి ఆర్డిఓ మీద కలెక్టర్ గారికి కలెక్టర్ మీద ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కూడా కల్పించినట్లు తెలిపారు.

ట్రేడ్ కార్పోరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి 

ప్రజల భూములకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చినట్లు తెలిపారు. గతంలో అసైన్ మెంట్ కమిటీ ఉండేదని దరణి వచ్చిన తరువాత గత ప్రభుత్వం అట్టి కమిటీని రద్దు చేసి, ఇష్టానుసారంగా నమోదులు చేశారని అన్నారు. నిపు ణులతో కమిటీ వేసి ఎవరికి అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా భూమి హక్కులు కల్పనకు దేశంలోనే ఆదర్శం గా ఉండే చట్టాన్ని తెచ్చినట్లు అయిత ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ

భూమికి భూధార్ కార్డు జారీ చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అన్ని రికార్డులు పకడ్బందీగా నమోదు చేయబడతాయని తెలిపారు. 12 నుండి సాగులో ఉంటే విచారణ నిర్వహించి పట్టా ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఉమ్మడి జిల్లాకు ఒకటి ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇచ్చే విధంగా భూ భారతిలో వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు. భూ భారతి చట్టం రైతులు సద్వినియోగం చేసుకొని అన్ని రకాల హక్కులు పొందాలని సూచించారు. రైతులు నూతన చట్టంపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 1989లో ఆర్ ఓ ఆర్ చట్టానికి రూల్స్ అమలు చేశారని తదుపరి 2020లో ధరణి చట్టం తీసుకువచ్చారని కానీ ధరణిలో ఎలాంటి రూల్స్ పెట్టలేదని, 2025 లో వచ్చిన భూ భారతి చట్టంలో అన్ని రూల్స్ పెట్టినట్లు తెలిపారు. అసెంబ్లీలో భూ భారతి చట్టం అమలు జరిగిందని ఏప్రిల్ 14న గౌరవ ముఖ్యమంత్రి చట్టానికి రూల్స్ ఫ్రేమ్ చేసి ప్రారంభించారని తెలిపారు. 18 సంవత్సరాల తర్వాత ఆర్ ఓ ఆర్ రూల్స్ వచ్చాయని, దరణిలో రూల్స్ లేవని భూభారతి పోర్టల్ చట్టం ద్వారా పటిష్టమైనటువంటి చట్టాన్ని అందు బాటులో తీసుకొచ్చారని తెలిపారు. దీనివల్ల ప్రజలకు అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టంలో మంచి సెక్షన్లు కూడా పకడ్బందీగా అమలు చేశారని లబ్ధిదారులకు మేలు చేసే విధంగా రూపొందించాలని తెలిపారు. తప్పుడు, మిస్సింగ్ ఎంట్రీలు నమోదైన పక్షంలో పహనీలో కరెక్షన్స్ చేయడానికి అవకాశం వచ్చిందని అప్పీలు చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారని ఆయన సూచించారు. దరణిలో తహసిల్దారు రిజెక్ట్ చేసిన పక్షంలో అప్పుడు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని నేడు తహసిల్దార్ నుంచి ఆర్డీవో, ఆర్డీవో నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ నుండి ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళొచ్చని అన్నారు. ఉచితంగా న్యాయ సేవలు అందిస్తారని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ రవి, తహసిల్దార్ శ్రీనివాసులు, సింగిల్ విండో చైర్మన్ మేకల సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment