కౌలు రైతు ఆత్మహత్య కుటుంబానికి ఆర్ డి ఎస్ చేయూత

https://telanganajyothi.in/film-actor-hero-vijay-deverakonda-should-be-arrested-immediately/

కౌలు రైతు ఆత్మహత్య కుటుంబానికి ఆర్ డి ఎస్ చేయూత

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల లోని కొత్తపల్లి తండాకు చెందిన అజ్మీర జయపాల్(35) కౌలు రైతు వ్యవసాయ అప్పుల బాధతో జూన్ 4 వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడిన కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ చేయూత అందించారు. ఆకుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ కర్ణాటకపు సమ్మయ్య సభ్యులు చల్లగురుగుల సంజీవ్ లు సోమవారం పరామర్శించి కుటుంబ పరిస్థితులు అగమ్యగోచరంగా ఉండడంతో రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ రూ40 వేలు ఆర్థిక సహాయం చేసి, ఉపాధి కోసం ఆ కుటుంబానికి రెండు గేదెలను ఉచితంగా పంపిణీ చేశారు. అజ్మీర జయపాల్ భార్య మౌనిక లకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఎకరం భూమి ఉండగా పట్టా కాలేదు, ఐదుఎకరాల పత్తి కౌలుకు తీసుకొని సాగు చేసే క్రమంలో రూ10 లక్షల అప్పు కావడం, పంట కు నష్టం రావడంతో తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక పురగుల మందు తాగి ఆత్మహత్య తీసుకున్నట్లు భార్య మౌనిక తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న జయపాల్ కుటుంబానికి ప్రభుత్వం 194 జిఓ, ప్రకారం ఎలాంటి నష్ట పరిహారం అందలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 421, 194,జిఓల ద్వారా, రూ6 లక్షలు నష్టపరిహారం అందించి రైతు ఆత్మహత్య కుటుంబాన్ని ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యలు తగ్గాలంటే, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి, పంట పెట్టుబడి ఖర్చుల పైన, 50 శాతం అదనంగా ఆదాయం వచ్చే లా స్వామినాథన్ కమీషన్ సూచనలను అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ వాలంటీర్, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య ,సమన్వయ కర్తలుగా వ్యవహరించగా, రైతు స్వరాజ్య వేదిక జయశంకర్ జిల్లా కో కన్వీనర్ చల్లగురుగుల సంజీవ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment