మిస్సయిన యువకుని మృతదేహం లభ్యం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం జక్కుల వారి వీధికి చెందిన వాసం రవి కిరణ్ ఈనెల 24వ తేదీన తప్పి పోగా మంగళవారం మృతదేహం లభ్యమయింది. మిషన్ భగీరథలో తాత్కాలిక పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వాసం రవి కిరణ్ తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత మంగళవారం వెంకటా పురం నుండి రాచపల్లి, మల్లాపురం వెళ్లే రహదారి ప్రక్కన విగత జీవిగా పడి ఉన్నాడు. మృతదేహం బాగా దెబ్బతిన్నట్లు సమాచా రం. యువకుడు వాసం రవి కిరణ్ మృతి పట్ల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ మేరకు వెంకటా పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిం చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.