చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్

చీకటి బతుకుల్లో వెలుగులు నింపుతున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపా లపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో ఆదివారం ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహిం చారు. ఈ ఉచిత కంటి పరీక్షలకు సుమారు 150 మంది ప్రజ లు హాజరై కంటి పరీక్షలు చేయించుకోగా అందులోని 60 మందికి కంటి ఆపరేషన్లు అవసరం ఉందని కంటి వైద్య నిపుణులు డాక్టర్ పూజారి దత్తాగౌడ్ నిర్దారించారు. ఈ సందర్భంగా జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి మాట్లాడారు. కంటి ఆపరేషన్లు అవసరం ఉన్న వారిని త్వరలో కరీంనగర్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయిస్తామని తెలియజేశారు. అలాగే కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ ను 9391075767 సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి జయశంకర్ ఫౌండేషన్ మొగుళ్ళపల్లి మండల ప్రెసిడెంట్ నేర్పటి అశోక్, వైస్ ప్రెసిడెంట్ మంగళపల్లి శ్రీనివాస్, రేగొండ మండల ఇంచార్జ్, ఆకుల ప్రతాప్, యూత్ ఇంచార్జ్ చింతకింది రాజు, నేర్పటి శ్రీనివాస్, జన్నే సదానందం, ,శంషీర్, కేశెట్టి రమేష్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment