గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం 163 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంలో మృతి చెంది న ద్విచక్ర వాహనదారున్ని మంగపేట మండలం కమలా పురం కు చెందిన గుగ్గిళ్ళ రమేష్ గా గుర్తించారు. జరిగిన ప్రమాదం తీరుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. రహదారికి ఇరువైపులా ఇసుక లారీలు నిలపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇసుక లారీలను అధికారులు నియంత్రించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని గుసగుసలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికైనా హైవే రహదారికి ఇరువైపులా లారీలను నిల్పకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులను వేడుకుంటున్నారు. 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి”

Leave a comment