న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం తగదు : జిల్లా ఎస్పీ శబరీష్
– కోర్టు డ్యూటీ, కోర్టు లైజనింగ్ అధికారులతో సమీక్ష సమావేశం
ములుగు ప్రతినిధి : న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం అంగీకరించదగినది కాదని, ప్రతి కేసు విచారణలో చార్జ్షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికారులను సూచించారు. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో కోర్టు డ్యూటీ, కోర్ట్ లైజనింగ్ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కోర్టు విచా రణకు సంబంధించి సాక్షుల హాజరును నిర్ధారించడంలో బాధ్య తాయుతంగా వ్యవహరించాలని, ప్రతి కేసులో సాక్షులకు విధిగా సమన్లు అందచేసి కోర్టుకి హాజరయ్యేలా చూడాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయాన్ని మెరుగుపరచి కేసుల పరిష్కార వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పోలీసు వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టాలంటే ప్రతి అధికారి తన విధులను నిబద్ధతతో, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వారంట్లను అమలు చేసి అనుమానితు లను/నేరస్థులను కోర్టుకు హాజరు పరచే సమయంలో వారిని సురక్షితంగా, సమయానికి న్యాయస్థానాలకు తరలించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినంగా వ్యవహ రించబడుతుందని హెచ్చరించారు. కోర్టు డ్యూటీల నిర్వహణలో పటిష్టత తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరిగేలాగా చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డీసీఆర్బీ డిఎస్పీ కిషోర్ కుమార్, డీసీఆర్బీ ఎస్సై లు జగదీష్, ఐటిసెల్ సిబ్బంది రాజేంద్రప్రసాద్, సంధ్య , కోర్టుల లైసన్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ట్రైన్ ఎస్ఐ లు పాల్గొన్నారు.