Murder | మహిళ దారుణ హత్య

Murder | మహిళ దారుణ హత్య

ములుగు ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపా లపల్లి మండలం గుర్రంపేట గ్రామానికి చెందిన మేకల కాప రి సకినాల సరస్వతి (45) మహిళను  దారుణ హత్యకి గురైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు  తెలిపిన వివరాల ప్రకారం… సరస్వతి భ‌ర్త కొంత కాలం కింద‌ట మృతి చెందారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు రాకేష్ వేరే చోట ఉంటున్నారు. ఆమె ఒంట‌రిగా ఉంటూ త‌డుక ర‌వికి చెందిన మేక‌ల‌కు కాప‌రిగా ఉంటూ జీవ‌నం సాగిస్తుంది. మేక‌ల కొట్టం శుభ్రం చేసేందుకు వెళ్లిన ఇత‌ర కాప‌రుల‌కు ర‌క్త‌పు మ‌డుగులో స‌ర‌స్వ‌తి నిర్జీవంగా ప‌డి ఉండ‌డాన్ని గ‌మ‌నించి గ్రామ‌స్థుల‌కు స‌మాచారం ఇచ్చారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీ సులు ఘటన స్థలానికి ములుగు సిఐ శంకర్, ఎస్సై సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.హత్యకు గల కారణాలు, నిందితుల గుర్తింపు కోసం డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ బృందా లతో ఆధారాలు సేకరిస్తు న్నారు. మృతురాలి సోదరుడు మధు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శంకర్ తెలిపారు. మృత దేహాన్ని పంచ నామా నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment